Viral News: భార్య‌, మాజీ భార్య క‌లిసి చంపేసారు

Bihar: ఇద్ద‌రు మ‌హిళ‌లు క‌లిసి భ‌ర్త‌ను దారుణంగా చంపేసారు. అందులో ఒక‌రు భార్య‌, మ‌రొక‌రు మాజీ భార్య కావ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఈ వైరల్ ఘ‌ట‌న (viral news) బిహార్‌లో చోటుచేసుకుంది. ఛాప్రా జిల్లాకు చెందిన అన్సారీ అనే 45 ఏళ్ల వ్య‌క్తి దిల్లీలో కూలీ ప‌ని చేస్తూ బతుకుతున్నాడు. ఇత‌నికి ప‌దేళ్ల క్రితం స‌ల్మా అనే యువ‌తితో వివాహ‌మైంది. కొన్ని కార‌ణాల వ‌ల్ల అన్సారీ స‌ల్మాతో విడిపోయి అమీనాను పెళ్లి చేసుకున్నాడు.

అన్సారీతో విడిపోయాక స‌ల్మా కూడా దిల్లీలోనే నివ‌సించేది. బక్రీద్ సంద‌ర్భంగా అన్సారీ బిహార్ వెళ్లాడు. అత‌ను బిహార్ వెళ్లాడ‌ని తెలుసుకుని మ‌రుస‌టి రోజే స‌ల్మా, అమీనా కూడా వెళ్లారు. ఏదో విష‌యంలో నిన్న వీరి ముగ్గురికీ గొడ‌వ జ‌రిగింది. అలా ముగ్గురూ వాదులాడుకున్నారు. క్ష‌ణికావేశంలో స‌ల్మా, అమీనా క‌లిసి అన్సారీని క‌త్తితో పొడిచేసారు. స్థానికులు చూసి అన్సారీని ద‌గ్గ‌ర్లోని హాస్పిట‌ల్‌కు తీసుకెళ్లినా ప్ర‌యోజనం లేకుండా పోయింది. బ్లీడింగ్ ఎక్కువ కావ‌డంతో అన్సారీ చ‌నిపోయాడు. అయితే అన్సారీ కుటుంబీకులు చెప్పిన వివ‌రాల ప్ర‌కారం.. స‌ల్మా, అమీనా క‌లిసి దిల్లీలో నివ‌సించేవార‌ట‌. అలా ఇద్ద‌రూ క‌క్ష గ‌ట్టి అన్సారీని చంపేసారని తెలిపారు. వారి వివ‌రాల మేర‌కు ఇద్ద‌రినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.