Viral News: ఒక్క హ‌గ్.. ఒక్క బుల్లెట్.. భార్యాభ‌ర్త‌లు మృతి

Uttar Pradesh: భార్య‌ను హ‌గ్ చేసుకున్న‌ట్లు న‌టించి ఆమెను తుపాకీతో కాల్చాడు భర్త‌ (viral news). కానీ ఆ బుల్లెట్ ఇద్ద‌రికీ త‌గ‌ల‌డంతో అక్క‌డికక్క‌డే మృతిచెందారు. ఈ ఘ‌టన ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లో (uttar pradesh) చోటుచేసుకుంది. మొరాదాబాద్‌కు (moradabad) చెందిన అనేక్‌, సుమ‌న్ దంప‌తులు త‌ర‌చూ గొడ‌వ‌ప‌డుతుండేవారు. నిన్న రాత్రి సుమ‌న్ అనేక్ కొనిచ్చిన ఫోన్ పోగొట్టుకుంది. దాంతో అనేక్‌కి కోపం వ‌చ్చి ఇంటికి రాగానే ఆమెతో గొడ‌వ‌ప‌డ్డాడు. ఆమెను ఎలాగైనా చంపాల‌నుకుని.. ఓదారుస్తున్న‌ట్లు హ‌గ్ చేసుకున్నాడు. వీపు వెన‌క గ‌న్నుతో కాల్చాడు. బుల్లెట్ చీల్చుకుని అనేక్‌కు కూడా త‌గ‌ల‌డంతో ఇద్ద‌రూ చ‌నిపోయారు. వీరిద్ద‌రికీ న‌లుగురు పిల్ల‌లు ఉన్న‌ట్లు పోలీసులు తెలిపారు. వారిని కుటుంబీకులకు అప్ప‌గించిన‌ట్లు పేర్కొన్నారు. అనేక్ వాడింది నాటు తుపాకీ అని తెలిసింద‌ని అది త‌న వ‌ద్ద‌కు ఎలా వ‌చ్చింది అన్న కోణంలో ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని పోలీసులు తెలిపారు.