Viral News: ప్రేయ‌సిని చంపి.. అవ‌య‌వాలు ఉడక‌బెట్టాడు

Mumbai: ముంబైలో దారుణం చోటుచేసుకుంది (viral news). ఓ వ్య‌క్తి త‌న ప్రేయ‌సిని దారుణంగా చంపి ఆమె శ‌రీరాన్ని చెట్లు న‌రికే కట్ట‌ర్‌తో ముక్క‌లుగా నరికేసాడు. అంత‌టితో ఆగ‌కుండా అవ‌య‌వాల‌ను కుక్క‌ర్‌లో ఉడ‌కబెట్టాడు. మీరా రోడ్డులో నివ‌సిస్తున్న మ‌నోజ్ స‌హానీ అనే 56 ఏళ్ల వ్య‌క్తి ఈ దారుణానికి పాల్ప‌డ్డాడు. త‌న కంటే వ‌య‌సులో 15 ఏళ్లు చిన్న‌దైన స‌ర‌స్వ‌తి విద్య అనే యువ‌తితో మ‌నోజ్ ముంబైలో స‌హ‌జీవ‌నం చేస్తున్నాడు. బుధ‌వారం రాత్రి మ‌నోజ్ ఉంటున్న ఫ్లాట్ నుంచి కుళ్లిన వాస‌న వ‌స్తుండ‌డంతో చుట్టు ప‌క్క‌ల వారు పోలీసుల‌కు ఫిర్యాదు చేసారు. పోలీసులు వ‌చ్చి చూసేస‌రికి కుక్క‌ర్లో అవ‌య‌వాలు కుళ్లిపోయి క‌నిపించాయి. ఘ‌ట‌నా స్థ‌లాన్ని బ‌ట్టి చూస్తే స‌రస్వ‌తిని మూడు రోజుల క్రిత‌మే చంపేసి అనుమానం రాకుండా మ‌నోజ్ పారిపోయిన‌ట్లు తెలుస్తోంద‌ని పోలీసులు తెలిపారు. ఇద్ద‌రు అనుమానితుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న‌ట్లు పేర్కొన్నారు.