Viral News: ఫారిన్ ట్రిప్ కోసం యువతి కిడ్నాప్ డ్రామా…!

Viral News: ఫారిన్ ట్రిప్ కోసం ఓ యువ‌తి ఏకంగా కిడ్నాప్ డ్రామా ఆడింది. త‌న‌ని తానే కిడ్నాప్ చేయించుకుని స్నేహితుల చేత త‌న తండ్రికి ఫోన్ చేయించి ఏకంగా రూ.30 ల‌క్ష‌లు కావాల‌ని అడిగించింది. ఆ తండ్రి పోలీసుల‌ను ఆశ్ర‌యించ‌డంతో నిందితురాలు త‌న కూతురే అని తెలిసి షాక‌య్యాడు. ఈ ఘ‌ట‌న మ‌ధ్య ప్ర‌దేశ్‌లో చోటుచేసుకుంది.

ఇండోర్‌కి చెందిన కావ్య అనే 30 ఏళ్ల యువ‌తి నీట్‌కు ప్రిపేర్ అవుతోంది. ఈ నేప‌థ్యంలో కావ్యను రాజ‌స్థాన్‌లోని కోటాలో దించేందుకు ఆమెతో పాటు త‌ల్లి కూడా వెళ్లారు. అయితే కావ్య తల్లి తిరిగి ఇంటికి వెళ్లిపోయాక‌.. కావ్య ఇండోర్‌లోకి తిరిగి వ‌చ్చేసింది. ఇద్ద‌రు అబ్బాయిల‌తో క‌లిసి ఓ రూంలో ఉంది. అదే స‌మ‌య‌లంలో కిడ్నాప్ ప్లాన్ వేసారు. రూ.30 లక్ష‌లు వ‌స్తే విదేశాల‌కు వెళ్లిపోవ‌చ్చ‌ని ప్లాన్ వేసారు. ఈ నేప‌థ్యంలో కావ్య త‌న‌ని త‌నే కిడ్నాప్ చేయించుకుని చేతులు కాళ్ల‌కు తాళ్లు క‌ట్టేసిన ఫోటోల‌ను త‌న స్నేహితుల ద్వారా తండ్రికి పంపింది. దాంతో ఆయ‌న గుండె ప‌గిలినంత పనైంది. రూ.30 ల‌క్షలు ఇస్తే వ‌దిలేస్తామ‌ని బెదిరించారు.

అంత డ‌బ్బు ఇప్ప‌టికి ఇప్పుడు ఇవ్వ‌డం చాలా క‌ష్ట‌మ‌ని.. ఇల్లు అమ్మేసినా కూడా ఇంత త్వ‌ర‌గా డ‌బ్బు రాద‌ని ఆ క‌న్న‌తండ్రి క‌న్నీరుమున్నీర‌య్యాడు. అయితే కావ్య కిడ్నాప్ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ వ‌డంతో విదేశాంగ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వెంట‌నే రాజ‌స్థాన్ ముఖ్య‌మంత్రి భ‌జ‌న్ లాల్ శ‌ర్మ‌కు లేఖ రాసారు. కావ్య రాజ‌స్థాన్‌లో కిడ్నాప్ అయిన‌ట్లు లేఖ రాస్తూ ఆమెను సుర‌క్షితంగా తీసుకురావాల‌ని కోరారు. దాంతో పోలీసులు విచార‌ణ‌ను ప్రారంభించారు. అయితే కావ్య చివ‌రి ఫోన్ లొకేష‌న్ ఇండోర్ అని చూపించ‌డంతో పోలీసులకు అనుమానం వ‌చ్చింది. ఇదంతా కావ్య కావాల‌ని ఆడిన డ్రామా అని తెలిసింది. అయితే ఇక్క‌డ మ‌రో ట్విస్ట్ ఏంటంటే.. కావ్య ఆచూకీ మాత్రం ల‌భించ‌లేదు. త్వ‌ర‌గా కావ్య‌ను ఇంటికి రావాల్సందిగా పోలీసులు ప్ర‌క‌ట‌న‌లు విడుద‌ల చేస్తున్నారు.