Viral News: బాలిక స్కెచ్.. అమ్మానాన్న‌ల నుంచి రూ.కోటి డిమాండ్!

Kolkata: ఓ మైన‌ర్ బాలిక కోటి రూపాయ‌ల కోసం ఆడిన డ్రామా చూసి పోలీసులే ఆశ్చ‌ర్య‌పోయారు. ఈ వైరల్(viral news) ఘ‌ట‌న క‌ల‌క‌త్తాలో చోటుచేసుకుంది. వెస్ట్ బెంగాల్‌లో నిన్న ప‌ది రిజ‌ల్ట్స్ వ‌చ్చాయి. బ‌న్స్‌ద్రోణి ప్రాంతానికి చెందిన ఓ బాలిక రిజ‌ల్ట్ క‌నుక్కుని వ‌స్తాన‌ని చెప్పి త‌న ఆరేళ్ల చెల్లెలిని ద‌గ్గ‌ర్లోని ఇంట‌ర్నెట్ సెంట‌ర్‌కు తీసుకెళ్లింది. మార్కుల లిస్ట్ డౌన్‌లోడ్ చేయించుకుంది. త‌న‌కు త‌క్కువ మార్కులు వ‌చ్చాయ‌ని తెలిసి అమ్మానాన్న‌లు తిడ‌తారేమోన‌ని భ‌య‌ప‌డింది. దాంతో మ‌ళ్లీ ఇంటికి వెళ్ల‌లేదు. ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ చేసుకుంది. అర్థ‌రాత్రి స‌మ‌యంలో ఫోన్ స్విచ్ఛాన్ చేసుకుని కిడ్నాప్ చేసార‌ని, కోటి రూపాయ‌లు ఇవ్వ‌క‌పోతే చంపేస్తామంటున్నార‌ని ఫేక్ మెసేజ్ పెట్టింది. దాంతో ఆ బాలిక త‌ల్లిదండ్రులు పోలీసుల‌కు ఫిర్యాదు చేసారు.

పోలీసులు సీసీటీవీలు సెర్చ్ చేయ‌గా బాలిక స్కూటీ ఓ మెట్రో స్టేష‌న్ వ‌ద్ద పార్క్ చేసిన‌ట్లు తెలిసింది. వారి ఫొటోల‌ను అన్ని మెట్రో స్టేష‌న్ల‌కు, పోలీస్ స్టేష‌న్ల‌కు పంప‌డంతో గంట‌లోనే వారిని పోలీసులు ప‌ట్టుకున్నారు. విచార‌ణ చేప‌ట్ట‌గా బాలికే ఫేక్ కాల్ చేసి కిడ్నాప్ డ్రామా ఆడింద‌ని తెలిసింది. ప‌రీక్ష‌ల్లో మంచి మార్కులు తెచ్చుకుంటానని అమ్మానాన్న‌ల‌కు ప్రామిస్ చేసాన‌ని కానీ మ‌రీ 31% మార్కులు రావ‌డంతో ముఖం చెల్ల‌క ఇలా చేసాన‌ని చెప్పింది.