Viral News: అరుపులు విన‌ప‌డ‌కుండా మ్యూజిక్ పెట్టి.. చంపేసారు!

Ghaziabad: దొంగ‌తనం చేసింద‌న్న అనుమానంతో బంధువులు ఓ యువ‌తిని దారుణంగా చంపేసారు (viral news). పైగా చంపేట‌ప్పుడు అరుపులు బ‌య‌టికి వినిపించ‌కుండా ఇంట్లో మ్యూజిక్ సౌండ్ పెట్టి మ‌రీ ఈ దారుణానికి పాల్ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని ఘ‌జియాబాద్‌లో (ghaziabad) చోటుచేసుకుంది. ఇంట్లో న‌గ‌లు దొంగ‌తనం చేసింద‌న్న అనుమానంతో స‌మీనా అనే 23 ఏళ్ల యువ‌తిని హీనా ర‌మేష్‌లు క‌లిసి బ్లేడ్‌తో కోసి రాడ్డుతో కొట్టి నిజం చెప్పాలంటూ టార్చ‌ర్ పెట్టారు. ఆ అమ్మాయి అరుస్తుంటే మ్యూజిక్ సౌండ్ పెట్టి మరీ టార్చ‌ర్ చేసారు. బ్లీడింగ్ ఎక్కువ అవ‌డంతో ఆ అమ్మాయి అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోయింది. దాంతో ఎవ్వ‌రికీ అనుమానం రాకుండా నిందితులు ఇంట్లో నుంచి వెళ్లిపోయారు.

దాదాపు రెండు రోజులుగా మ్యూజిక్ ఆప‌కుండా మోగుతుంటే చుట్టు ప‌క్క‌ల వారికి అనుమానం వ‌చ్చి పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో విష‌యం బ‌య‌ట‌ప‌డింది. హీనా రాజేష్‌ల కుమారుడి బ‌ర్త్‌డే పార్టీ ఉండ‌టంతో సోమ‌వారం స‌మీనా వాళ్లింటికి వెళ్లింది. పార్టీ అయిపోయాక హీనాకు సంబంధించిన న‌గ‌లు క‌నిపించ‌కుండాపోయాయి. దాంతో ఇంటికి వ‌చ్చిన స‌మీనానే ఈ దొంగ‌త‌నం చేసి ఉంటుంద‌ని అనుమానించారు. నిందితుల కోసం గాలింపులు చేప‌డుతున్న‌ట్లు పోలీసులు తెలిపారు.