Viral News: ల‌వ‌ర్‌తో రొమాన్స్.. భ‌ర్త‌పై త‌ప్పుడు కేసులు!

Uttar Pradesh: వివాహం అయిన‌ప్ప‌టికీ మ‌రొక‌రితో అక్ర‌మ సంబంధం పెట్టుకుని (viral news) అత‌నితో రొమాన్స్ చేస్తూ దొరికిపోయింది ఓ మ‌హిళ. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లో చోటుచేసుకుంది. వార‌ణాసికి చెందిన ఓ మ‌హిళ అత్త‌గారింట్లో ఉంటూనే ఓ యువ‌కుడితో అక్ర‌మ సంబంధం పెట్టుకుంది. ఇంట్లో ఎవ‌రూ లేని స‌మ‌యంలో ఆ యువ‌కుడు వ‌చ్చి వెళ్తుండేవాడు. నిన్న సాయంత్రం ఇంట్లో అత్త‌గారు లేక‌పోవ‌డంతో ఆ మ‌హిళ త‌న ప్రియుడ్ని ఇంటికి ర‌మ్మ‌ని పిలిచింది. వారిద్ద‌రూ రొమాన్స్‌లో ఉండ‌గా అత్త‌గారు రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టుకుంది. ఆ యువ‌కుడిని చావ‌బాదింది. దాంతో అత‌ను అక్క‌డి నుంచి పారిపోయాడు. ఈ విష‌యం ముంబైలో ఉద్యోగం చేస్తున్న త‌న కొడుక్కి చెప్పింది. దాంతో అత‌ను వెంట‌నే త‌న స్వ‌స్థ‌లానికి వ‌చ్చేసాడు. ఇంత జ‌రిగాక కూడా త‌న భార్య‌ను క్ష‌మించి కాపురం చేయ‌డానికి ఆ వ్య‌క్తి ఒప్పుకున్నాడు. కానీ ఆ మ‌హిళ మాత్రం త‌న ప్రియుడితోనే ఉంటాన‌ని అంటోంది. దాంతో భ‌ర్త‌పై వ‌రక‌ట్న వేధింపులు, గృహ‌హింస కేసులు పెట్టింది.

చాలా మంది మ‌హిళ‌లు ఇలాంటి త‌ప్పుడు కేసులు పెట్టి భ‌ర్త‌ల‌ను ఇరికిస్తున్నారు. ఇలాంటి కేసులు ఈ మ‌ధ్య‌కాలంలో ఎక్కువ అవుతున్నాయి. ఇష్టం లేన‌ప్పుడు మ‌ర్యాద‌గా విడాకుల‌కు అప్లై చేసుకుంటే స‌రిపోతుంది. కానీ చ‌ట్టంలో ఆడ‌వాళ్ల‌కు క‌ల్పించిన కొన్ని ప్ర‌యోజ‌నాలను ఇలా త‌ప్పుగా వాడుకుంటున్నారు కొంద‌రు మ‌హిళ‌లు. ఇలాంటి త‌ప్పుడు కేసుల వ‌ల్ల నిజాయ‌తీగా ఉన్న మ‌గ‌వాళ్లు న‌ర‌కం అనుభ‌విస్తున్నారు. ఇక‌నైనా ఇలాంటి గృహ‌హింస‌, విడాకులు, వ‌ర‌క‌ట్న వేధింపుల చ‌ట్టాల‌కు సంబంధించి మార్పులు చేస్తే బాగుంటుంది.