Viral News: భ‌ర్త పేరును నుదుటిపై టాటూ వేయించుకుంది!

Bengaluru: ఎవ‌రైనా ఒక‌రిపై ఇష్టం ఉంటే వారి పేరును చేతి వేళ్ల‌పై, గుండెపై టాటూగా(tattoo) వేయించుకుంటారు(viral news). కానీ ఓ మ‌హిళ ఏకంగా త‌న నుదుటిపై టాటూ వేయించుకుంది. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క(karnataka) రాజ‌ధాని బెంగ‌ళూరులో (bengaluru) చోటుచేసుకుంది. బెంగ‌ళూరుకు(bengaluru) చెందిన ఓ మ‌హిళ స్థానిక కింగ్ మేక‌ర్ టాటూ స్టూడియోకి వెళ్లింది. త‌న భ‌ర్త పేరు స‌తీష్ అని ఆ పేరును నుదుటిపై ప‌చ్చ‌బొట్టులా(tattoo) వేయాల‌ని కోరింది. అది విని టాటూ ఆర్టిస్ట్ షాక‌య్యాడు. ఎవ‌రైనా చేతి మీదో లేక వేళ్ల‌పైనో వేయించుకుంటారు మీరేంటి మేడం నుదుటిపై వేయమంటున్నారు అని అడిగాడు. తన భ‌ర్త‌కు స‌ర్‌ప్రైజ్ ఇవ్వ‌డానికే వేయించుకుంటున్నా అని చెప్పింది. అయిన‌ప్ప‌టికీ అత‌ను ప‌లుమార్లు మ‌రోసారి ఆలోచించండి అని చెప్పాడు. కానీ ఆ మ‌హిళ విన‌లేదు. దాంతో కార్బ‌న్ పేప‌ర్‌తో నుదుటిపై పేరు రాసాడు. అప్ప‌టివ‌ర‌కు ఎంతో ఎగ్జైట్ అయిన ఆ మ‌హిళ‌.. టాటూ పెన్ను గుచ్చ‌గానే వ‌ద్దు వ‌ద్దు అని నొప్పికి అల్లాడిపోయింది. అయితే టాటూ మొత్తం వీడియోని త్వ‌ర‌లో వెల్ల‌డిస్తామ‌ని స్టూడియో సిబ్బంది తెలిపారు.