Telangana: మోదీకి ఓటెయ్యాలంటూ శుభ‌లేఖ..!

Telangana: ఈసారి లోక్ స‌భ ఎన్నిక‌ల్లో (Lok Sabha Elections) మ‌ళ్లీ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకే  (Narendra Modi) ఓటెయ్యాలంటూ తెలంగాణ‌కు చెందిన ఓ కుటుంబం శుభ‌లేఖ‌లు ప్రింట్ చేయించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ ఘ‌ట‌న సంగారెడ్డిలో చోటుచేసుకుంది. నానికంటి న‌ర‌సింహులు అనే వ్య‌క్తి త‌న కుమారుడు సాయి కుమార్‌కు పెళ్లి నిశ్చ‌యం అవ్వ‌డంతో శుభ‌లేఖ‌లు అచ్చు వేయించారు. అయితే శుభ‌లేఖ‌పై మీరు కానుక‌లు తీసుకురావ‌ద్దు. న‌రేంద్ర మోదీకి ఓటేసి గెలిపించ‌డ‌మే మీరు ఇచ్చే అస‌లైన కానుక అని ప్రింట్ చేయించారు. ఎన్నిల‌క నియమావ‌ళి అమ‌ల్లో ఉన్న నేప‌థ్యంలో ఈ శుభ‌లేఖ చ‌ర్చ‌కు దారి తీసింది. న‌ర‌సింహులు స్వ‌యంగా మోదీపై అభిమానంతో ఇలా ప్రింట్ చేయించారా లేదా లోక‌ల్ భార‌తీయ జ‌న‌తా పార్టీ నేత‌ల జిమ్మిక్కా అనేది తెలియాల్సి ఉంది.