Viral news: పెళ్ల‌య్యాక న‌గ‌లు, డ‌బ్బుతో ఉడాయించింది!

Kanpur: పెళ్ల‌య్యాక న‌గ‌లు, డ‌బ్బుతో వ‌ధువు ఉడాయించిన ఘ‌ట‌న ఉత్తర్‌ప్ర‌దేశ్‌లో చోటుచేసుకుంది (viral news) . కాన్పూర్‌కి (kanpur) చెందిన రామ్ క‌ర‌ణ్ అనే వ్య‌క్తి పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో ఈ ఘ‌ట‌న బ‌య‌ట‌ప‌డింది. రామ్ క‌ర‌ణ్ పెళ్లి సంబంధాలు చూడ‌మ‌ని ఓ బ్రోక‌ర్‌కి ఏకంగా రూ.70,000 ఇచ్చాడు. అత‌ను బిహార్‌కి చెందిన ఓ యువ‌తితో రామ్ క‌ర‌ణ్ పెళ్లి ఫిక్స్ అయింది. పెళ్లి జ‌రిగాక భార్య‌ను తీసుకుని రామ్ క‌ర‌ణ్ కాన్పూర్ వెళ్లాడు. వారం రోజుల‌కే భార్య క‌నిపించ‌కుండాపోయింది. బంధువులు, ఇంట్లో వారిని ఆరాతీసినా ఫ‌లితం లేకుండాపోయింది. దాంతో రామ్ క‌ర‌ణ్ పోలీసుల‌ను సంప్ర‌దించాడు. పెళ్లి స‌మ‌యంలో గిఫ్ట్‌గా కొన్ని న‌గ‌లు కూడా చేయించి ఇచ్చాన‌ని, అవి ఇంట్లో క‌నిపించ‌డంలేదని, రూ.50,000 న‌గ‌దు కూడా పోయాయ‌ని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దాంతో పెళ్లి కూతురే అవ‌న్నీ తీసుకుని ఉడాయించింద‌న్న అనుమానంతో కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌డుతున్నారు.