Viral News: స్నేహితుడి చితిపై దూకిన యువ‌కుడు

Uttar Pradesh: ప్రాణ స్నేహితుడు లేని జీవితం వ్య‌ర్ధ‌మ‌ని.. అత‌నితో పాటే చితిలోకి దూకి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు ఓ యువ‌కుడు (viral news). ఈ విషాద ఘ‌ట‌న ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లో (uttar pradesh) జ‌రిగింది. ఫిరోజాబాద్‌కు చెందిన అశోక్ కుమార్, గౌర‌వ్ సింగ్ చిన్న‌ప్ప‌టి నుంచి ప్రాణ స్నేహితులు. అనారోగ్య స‌మ‌స్య‌తో అశోక్ కుమార్ శ‌నివారం చ‌నిపోయాడు. కుటుంబ స‌భ్యులు అత‌ని చితికి నిప్పు పెట్టి అంత్య‌క్రియ‌లు పూర్త‌య్యాయ‌ని వెళ్లిపోతుండ‌గా.. మండుతున్న చితిలోకి దూకేసాడు గౌర‌వ్ సింగ్. అక్కడే ఉన్న‌వారు వెంట‌నే గౌర‌వ్ సింగ్‌ను బ‌య‌టికి లాగినా అప్ప‌టికే 90% శ‌రీరం కాలిపోయింది. దాంతో హాస్పిట‌ల్‌కి తీసుకెళ్తుండ‌గానే చ‌నిపోయాడు. స్నేహితుడి మ‌ర‌ణాన్ని త‌ట్టుకోలేకే అశోక్ కుమార్ చ‌నిపోయిన‌ట్లు పోలీసులు తెలిపారు.

గౌర‌వ్, అశోక్ చిన్న‌ప్ప‌టి నుంచి ఒక‌టే స్కూల్‌లో చ‌దువుకున్నార‌ని, ఇద్దరూ ఒకే రోజున పెళ్లిళ్లు చేసుకున్నార‌ని గౌర‌వ్ సోద‌రుడు పోలీసుల‌కు తెలిపాడు. ఇద్ద‌రూ పెళ్లిళ్ల‌కు బ్యాండ్ మేళం వాయిస్తుండేవార‌ని, 6 నెల‌ల క్రితం అశోక్‌కి క్యాన్స‌ర్ సోక‌డంతో అత‌ను గౌర‌వ్‌తో క‌లిసి వెళ్లలేక‌పోయేవాడ‌ని పేర్కొన్నాడు. శ‌నివారం అశోక్ చ‌నిపోవ‌డంతో గౌర‌వ్ కూడా అత‌నితో పాటే వెళ్లిపోవాల‌నుకోవ‌డం బాధాక‌రం అంటూ క‌న్నీరుమున్నీర‌య్యాడు. (viral news)