Kadapa: నలుగురి ప్రాణం తీసిన అక్రమ సంబంధం

అక్ర‌మ సంబంధం న‌లుగురి ప్రాణాల‌ను బ‌లిగొన్న ఘ‌ట‌న క‌డ‌ప జిల్లా (kadapa) పులివెంద‌ల ప‌ట్ట‌ణంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం టి.వెంకటేశ్వర్(51) 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్(రైటర్) విధులు నిర్వహిస్తున్నాడు. వెంకటేశ్వర్ భార్యకి తెలియకుండా రమాదేవి అనే ప‌రాయి మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.

ఈ విషయం ఇంట్లో తెలీడంతో త‌ర‌చూ భార్యాభర్తల మధ్య గొడవలు జ‌రుగుతూ ఉండేవి. ఈ నేప‌థ్యంలో వెంకటేశ్వర్ జూన్ 26వ తేదీన 20 లక్షల విలువ చేసే భూమి రమాదేవి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడు. పథకం ప్రకారమే రెండు బాండ్ పేపర్లపై తన మరణాంతరం తన ఆస్తి, పెన్షన్ పథకం, తన ఉద్యోగం రమాదేవి కుమారుడికి ఇవ్వాలని రాసి బుధవారం రాత్రి తన భార్య మాధవిని(47), ఇద్దరు కూతుళ్లు లాస్య(19), అభిజ్ఞ(16)లను తుపాకీతో కాల్చి తనను కాల్చుకొని చనిపోయాడు.