లండన్‌లో భ‌ర్త‌ను వ‌దిలేసి.. గోవాలో ట్యాక్సీ డ్రైవ‌ర్‌తో రాస‌లీల‌లు

hyderabad woman falls in love with taxi driver

Hyderabad: బంగారం లాంటి భ‌ర్త‌.. వ‌జ్రాల్లాంటి ఇద్ద‌రు పిల్ల‌లు.. లండ‌న్‌లో కాపురం. ఇంత‌కంటే ఏం కావాలి? కానీ ఓ మ‌హిళ మాత్రం భ‌ర్తను, పిల్ల‌ల్ని వ‌దిలేసి హైద‌రాబాద్‌కి చెందిన ఓ ట్యాక్సీ డ్రైవ‌ర్‌తో ప్రేమ‌లో ప‌డింది. వివ‌రాల్లోకెళితే.. హైదరాబాద్ అల్వాల్‌కు చెందిన జంటకు 17 ఏళ్ల క్రితం వివాహం కాగా.. ప్రస్తుతం లండన్లో నివసిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో తన తల్లి హైదరాబాద్లో మృతి చెందగా.. అస్తికల నిమజ్జనం కోసం ఆమె హైద‌రాబాద్ వచ్చింది. ఓ ట్యాక్సీని అద్దెకు తీసుకుని తిరిగాక.. డ‌బ్బుల‌ను ఆన్‌లైన్ ద్వారా చెల్లించింది.

ట్యాక్సీ డ్రైవర్ శివ ఆమె సెల్‌ఫోన్ నంబరును సేవ్ చేసుకుని చాటింగ్ మొదలుపెట్టాడు. అతడి మాయమాటలకు వివాహిత ఆకర్షితురాలైంది. అయితే సెప్టెంబరు 16న ఆమె భర్త తల్లి మృతి చెందడంతో భార్య, పిల్లలను వదిలేసి ఒంటరిగా హైదరాబాద్ వచ్చాడు. అయితే భార్య కూడా సెప్టెంబరు 30న ఎవరికీ చెప్పకుండా.. ప్రియుడి జన్మదిన వేడుక కోసమని హైదరాబాద్ వచ్చేసింది. అమ్మ ఇంటికి రావడం లేదని పిల్లలు చెప్పడంతో భర్త వెంటనే భార్యకు ఫోన్ చేసినా, స్పందన లేదు.

దీంతో కంగారుపడి ఆయన లండన్ వెళ్లి ఆరా తీయగా, భార్య హైదరాబాద్ వెళ్లినట్లు తేలింది. మరోసారి ఫోన్ చేయగా ఆమె నంబరు కలిసింది. అయితే ఓ ట్యాక్సీ డ్రైవర్ కిడ్నాప్ చేసి శంషాబాద్లోని ప్రైవేటు హాస్టల్లో ఉంచాడని భర్తను నమ్మించింది. ఆందోళనకు గురైన ఆమె భర్త స్నేహితులకు, పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు.. సెల్‌ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా ఆమె గోవాలో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే వెళ్లి, ఆమెను అదుపులోకి తీసుకుని.. లండన్‌కు పంపించారు. ట్యాక్సీ డ్రైవర్ శివపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.