Instagram: భార్య‌కు ఫాలోవ‌ర్ల క్రేజ్.. చంపేసిన భర్త‌

Hyderabad: త‌న భార్య‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో  (instagram) ఫాలోయింగ్ ఎక్కువ‌గా ఉంద‌న్న కుళ్లుతో ఆమెను చంపేసాడు ఓ క‌సాయి భ‌ర్త‌. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లో చోటుచేసుకుంది. పారా ప్రాంతానికి చెందిన ఈ భార్యాభ‌ర్త‌ల‌కు ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు. అయితే ఈ మ‌ధ్య‌కాలంలో ఆ మ‌హిళ ఎక్కువగా ఇన్‌స్టాగ్రామ్ వాడుతోంద‌ట‌. ఆమెకు ఫాలోయింగ్ కూడా బాగా ఉంది. దాంతో తాను లేని స‌మ‌యంలో ఇన్‌స్టాగ్రామ్‌లో ప‌రిచ‌యం అయిన వాళ్లు ఇంటికి వ‌చ్చి వెళ్తున్నారేమోన‌ని అనుమాన‌ప‌డ్డాడు భ‌ర్త‌. అప్ప‌టికే ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను బ్లాక్ చేసేసాడు.

అయితే నిన్న త‌న భార్య‌ను, పిల్ల‌ల్ని తీసుకుని రేయ్ బ‌రేలీకి వెళ్లాడు. పూర్వాంచ‌ల్ ఎక్స్‌ప్రెస్ వే ద‌గ్గ‌రికి చేరుకోగానే వీరిద్ద‌రూ ఇన్‌స్టాగ్రామ్ బ్లాక్ చేసిన విష‌య‌మై గొడ‌వ‌ప‌డ్డారు. మాటా మాటా పెర‌గ‌డంతో పెద్ద యుద్ధ‌మే జ‌రిగింది. దాంతో కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక క్ష‌ణికావేశంలో భార్య గొంతు నులిమి చంపేసాడు. దాంతో పిల్ల‌లు గ‌ట్టిగా ఏడ‌వ‌టం మొద‌లుపెట్టారు. ఆ త‌ర్వాత అత‌ను కారులోనే కూర్చుని లాక్ చేసేసుకున్నాడు. అటుగా పాట్రోలింగ్‌కి వెళ్తున్న పోలీసుల‌కు అనుమానం వ‌చ్చి అడిగారు. పిల్ల‌లు అస‌లు విష‌యం చెప్ప‌డంతో వెంట‌నే అత‌న్ని అదుపులోకి తీసుకున్నారు. (instagram)