బిడ్డ లింగం తెలుసుకోవాల‌ని.. రంపంతో గ‌ర్భం కోసి..

husband cuts open wife's stomach to find baby gender

Viral News: భార్య క‌డుపులో పెరుగుతున్న బిడ్డ మ‌గో ఆడో తెలుసుకునేందుకు ఓ కీచ‌కుడు గ‌ర్భిణి అయిన భార్య క‌డుపును చీల్చేసాడు. ఈ ఒళ్లు గ‌గుర్పొడిచే ఘ‌ట‌న ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లో చోటుచేసుకుంది. బ‌దౌన్ జిల్లాకు చెందిన ప‌న్నా లాల్ అనే వ్య‌క్తికి అనిత అనే యువ‌తితో 22 ఏళ్ల క్రితం వివాహం అయ్యింది. ఇప్ప‌టికే ఐదుగురు కుమార్తెల‌ను క‌న్నారు. ఎలాగైనా మ‌గ బిడ్డ‌ను క‌నాల‌న్న ఉద్దేశంతో ప‌న్నా లాల్ మ‌రో బిడ్డ‌ను క‌నాల‌ని అనిత‌ను బ‌ల‌వంతం చేసాడు. ఆమె గ‌ర్భం దాల్చ‌డంతో ఈసారైనా మ‌గ బిడ్డో కాదో తెలుసుకోవాల‌నుకున్నాడు. అందుకే మ‌న చ‌ట్టం ఒప్పుకోదు కాబ‌ట్టి.. నిండు గ‌ర్భిణి అని కూడా చూడ‌కుండా రంపంతో క‌డుపు చీల్చాడు.

ర‌క్త స్రావంతోనే అనిత బ‌య‌టికి ప‌రుగులు తీసింది. రక్తం ఓడుతున్న ఆమెను చూసిన స్థానికులు వెంట‌నే హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. అనిత ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డింది కానీ లోప‌ల బిడ్డ చ‌నిపోయింది. దాంతో ప‌న్నా లాల్‌పై కేసు న‌మోదైంది. ఈ ఘ‌ట‌న త‌ర్వాత నిందితుడు ప‌రార‌య్యాడు.