Hyderabad: పిస్టల్‌తో బెదిరించిన హోంగార్డ్.. భయంతో వ్యక్తి ఆత్మహత్య

Hyderabad: హైద‌రాబాద్‌లోని రామంతాపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. సత్యనగర్ కాలనీకి చెందిన నాగ‌రాజు అనే హోంగార్డ్ త‌న వ‌ద్ద ఉన్న పిస్ట‌ల్‌తో హల్చల్ చేసాడు. దాంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పిస్టల్‌తో ఇంటిపక్కనే నివాసం ఉండే శ్రీనివాస్(55)ని బెదిరించడంతో అతడు భయపడి విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆగ్రహించిన బంధువులు హోంగార్డ్ ఇంటి వద్ద మృతదేహంతో ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు నాగరాజుని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు.