Hyderabad: వీడిన మ‌ల‌క్‌పేట మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ..!

Hyderabad: హైదరాబాద్‌లోని (hyderabad) మలక్‌పేట్‌ (malakpet) పరిధిలో కొన్ని రోజుల క్రితం మొండెంలేని ఓ మహిళ మృత‌దేహం (murder) ల‌భ్య‌మైంది. ఈ హత్య కేసును పోలీసులు ఛేదించ‌డంతో మిస్ట‌రీ వీడింది. అస‌లు ఏం జ‌రిగిందంటే.. అనురాధ అనే యువ‌తి కేర్ హాస్పిట‌ల్‌లో న‌ర్సుగా పనిచేస్తూ సైడ్ బిజినెస్ కింద వ‌డ్డీ వ్యాపారం చేస్తుండేది. నగదు లావాదేవీల విషయంలో చైత‌న్య‌పురికి చెందిన చంద్ర‌మోహ‌న్ అనే వ్య‌క్తితో ఆమెకు ఎప్ప‌టినుంచో గొడ‌వ‌లు ఉన్నాయి. కొన్ని నెల‌ల‌ క్రితం చంద్ర‌మోహ‌న్ అనురాధ నుంచి రూ.7 ల‌క్ష‌లు అప్పుగా తీసుకున్నాడు. డ‌బ్బు తీసుకుని చాలా రోజులు అవుతున్నా తిరిగి ఇవ్వ‌క‌పోవ‌డంతో అనురాధ మండిప‌డింది. ఇవ్వ‌క‌పోతే బాగోదు అని గొడ‌వ‌కు దిగింది. దాంతో ఎలాగైనా ఆమె అడ్డు తొల‌గించుకుని డ‌బ్బు ఎగ్గొట్టాల‌ని ప్లాన్ వేసాడు చంద్ర‌మోహ‌న్. అనురాధ‌ను మాట్లాడుకుందాం అని పిలిచి ఆమెను ముక్క‌లు ముక్క‌లుగా న‌రికి చంపాడు. శ‌రీర భాగాల‌ను త‌న ఇంట్లోని ఫ్రిడ్జ్‌లో దాచాడు. మృతురాలి ఆచూకీ కోసం ఎనిమిది బృందాలను ఏర్పాటు చేసి, మహిళ తలతో పోస్టర్లను ముద్రించారు. వీధుల్లో తిరుగుతూ ఆచూకీ కోసం ఆరా తీశారు. మొత్తానికి కేసును చేధించిన పోలీసులు చంద్ర‌మోహ‌న్‌ను అరెస్ట్ చేసారు.