IPL 2024: రోహిత్ శ‌ర్మ‌ను ప‌క్కన‌పెట్టిన ముంబై ఇండియ‌న్స్

IPL 2024: IPLలో ముంబై ఇండియ‌న్స్ (mumbai indians) సార‌థ్యం వ‌హిస్తూ ఐదు సార్లు టైటిల్ గెలిచిన రోహిత్ శ‌ర్మ‌ను (rohit sharma) ఈసారి ముంబై ఇండియ‌న్స్ ప‌క్క‌న పెట్టింది. 2024 IPL కోసం హార్దిక్ పాండ్య‌ను త‌మ జ‌ట్టులోకి చేర్చుకున్న ముంబై ఇండియ‌న్స్ ఇప్పుడు కెప్టెన్సీ ప‌గ్గాల‌ను కూడా హార్దిక్‌కే అప్ప‌గించింది.

ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు స‌చిన్ తెందుల్క‌ర్, హ‌ర్భ‌జ‌న్ సింగ్, రికీ పాంటింగ్, రోహిత్ శ‌ర్మ‌ల నేతృత్వంలో ఎంతో బ‌ల‌ప‌డింద‌ని.. ముందు ముందు మ‌రింత బ‌ల‌ప‌ర్చేందుకు హార్దిక్ పాండ్య‌ను కెప్టెన్‌గా ప్ర‌క‌టిస్తున్న‌ట్లు తెలిపింది. రోహిత్ శ‌ర్మ జ‌ట్టు కోసం క‌ష్ట‌ప‌డి ఐదు సార్లు టైటిల్ గెలిపించాడ‌ని అందుకు ఆయ‌న‌కు రుణ ప‌డి ఉంటామ‌ని పేర్కొంది. ముంబై ఇండియ‌న్స్‌కు రోహిత్ శ‌ర్మ 2013 నుంచి కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.