Madhya Pradesh: తృటిలో త‌ప్పిన మ‌రో ప్ర‌మాదం!

Indore: తృటిలో త‌ప్పిన మ‌రో ప్ర‌మాదం.. ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్ర‌మాద ఘ‌ట‌న త‌ర్వాత ఈసారి మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో (madhya pradesh) గూడ్స్ రైలు ప‌ట్టాలు త‌ప్పింది. అందులోనూ ఎల్‌పీజీని మోసుకెళ్తున్న గూడ్స్ రైలు ప‌ట్టాలు త‌ప్పింది. అదృష్ట‌వ‌శాత్తు ఎవ్వ‌రికీ ఏమీ కాలేదు. జ‌బ‌ల్‌పూర్ జిల్లాలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. భార‌త పెట్రోలియం డిపో స‌మీపంలో గూడ్స్ రైలు ప‌ట్టాల‌ను అదుపు త‌ప్పింది. ఏమాత్రం బోగీలు ఇంకాస్త దూరంలో పట్టాలు అదుపు త‌ప్పినా భారీ పేలుడు సంభ‌వించేది. స‌మాచారం అందుకున్న అధికారులు రాత్రికి రాత్రే చ‌ర్య‌లు చేప‌ట్టారు.