ప‌రిచ‌యం పెంచుకుని.. బాలిక‌ను పార్టీని పిలిచి.. అత్యాచారం చేయించి..

girl raped by friend in birthday party

Chennai: త‌మిళ‌నాడు రాజ‌ధాని చెన్నైలో దారుణం చోటుచేసుకుంది. ఓ బ‌ర్త్‌డే పార్టీలో 15 ఏళ్ల బాలికపై ఇద్ద‌రు వ్య‌క్తులు అత్యాచారం చేసారు. ఈ దారుణానికి స్నేహితులే మ‌ద్ద‌తు ఇవ్వ‌డం షాకింగ్ విష‌యం. ఇంట‌ర్ చ‌దువుతున్న బాలిక స్థానిక అన్నా న‌గ‌ర్‌లోని కెఫెకి వెళ్లింది. అక్క‌డ ఓ మ‌హిళ ఆ బాలిక‌తో మాట్లాడి స్నేహాన్ని ఏర్ప‌ర‌చుకుంది. మ‌రుస‌టి రోజు త‌న పుట్టిన రోజ‌ని పార్టీకి త‌ప్ప‌కుండా రావాల‌ని ఆహ్వానించింది.

ఆ బాలిక యువ‌తి మాట‌లు న‌మ్మి పార్టీకి వెళ్లింది. ఆ స‌మ‌యంలో ఆ యువ‌తి బాలిక‌కు ఇచ్చే డ్రింక్‌లో మ‌త్తు మందు క‌లిపి తాగించింది. అది తాగాక బాలిక స్పృహ త‌ప్పి ప‌డిపోగా.. ఇద్ద‌రు వ్యక్తులు అత్యాచారం చేసారు. బాలిక‌కు స్పృహ రాగానే.. జ‌రిగిన విష‌యం ఎవ‌రికైనా చెప్తే చంపేస్తామ‌ని బెదిరించారు.

ఆ త‌ర్వాత బాలిక ఇంటికి వెళ్లిపోయింది. రెండు రోజులుగా ఆ బాలిక‌కు అనారోగ్యంగా ఉండటంతో ఆమె సోద‌రి వైద్యుల ద‌గ్గ‌ర‌కు తీసుకెళ్ల‌గా ఆమెపై అత్యాచారం జ‌రిగిన‌ట్లు తెలిసింది. దాంతో వెంట‌నే వారు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా.. మాయ మాట‌లు చెప్పి నమ్మించిన యువ‌తితో పాటు అత్యాచారం చేసిన వ్య‌క్తుల‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.