Disha Salian: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మేనేజ‌ర్ ఆత్మ‌హ‌త్య‌పై సిట్ విచార‌ణ‌

Disha Salian: దివంగ‌త న‌టుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (sushant singh rajput) మేనేజ‌ర్ దిశా సాలియ‌న్ ఆత్మ‌హ‌త్య కేసులో ఎట్ట‌కేల‌కు పురోగ‌తి వ‌చ్చింది. ఈ కేసును ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం ద‌ర్యాప్తు చేయ‌నుంది. మాల్వియ‌న్ పోలీస్ స్టేష‌న్ సీనియ‌ర్ ఇన్‌స్పెక్ట‌ర్ చీమాజీ అధ‌వ్ ఈ కేసును ద‌ర్యాప్తు చేయ‌నున్నారు. ఈ విచార‌ణను ముంబై డీసీపీ అజ‌య్ భ‌న్స‌ర్ ప‌ర్యవేక్షిస్తారు.

2020 జులై 8న దిశా సాలియ‌న్ ఓ బిల్డింగ్ నుంచి దూకి ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఈ కేసు రాజ‌కీయాంశంగా మారింది. దిశా సాలియ‌న్ ఆత్మ‌హ‌త్య‌కు ముందు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అదే ఏడాది జూన్ 14న ఆత్మహత్య చేసుకున్నాడు. సుశాంత్ మ‌ర‌ణం యావ‌త్ భార‌త‌దేశాన్ని షాక్‌కు గురి చేసింది. అస‌లు వీరిద్ద‌రూ ఎందుకు చ‌నిపోయారు అనే అంశంపై ఇప్ప‌టివ‌ర‌కు ఎవ్వ‌రూ ఎలాంటి విష‌యాలు వెల్ల‌డించ‌లేదు. దిశా సాలియ‌న్ కేసు విచార‌ణ ఓ కొలిక్కి వ‌స్తే త‌ప్ప సుశాంత్ ఇంత‌టి అఘాయిత్యానికి ఎందుకు పాల్ప‌డ్డాడో తెలీదు.