Charminar: ప్రాణం తీసిన ముగ్గు గొడవ

Charminar: ముగ్గు కోసం జ‌రిగిన గొడ‌వ ఒక‌రి ప్రాణం తీసింది. ఈ ఘ‌ట‌న చార్మినార్‌లోని (charminar) ఛ‌త్రినాక ప‌రిధిలో చోటుచేసుకుంది. శివాజీనగర్‌కు చెందిన‌ మాణిక్ ప్రభు తల్లి ఇంటి ముందు ముగ్గు వేసింది. పక్కింటి వారు నీళ్లు పోయగా.. అది కాస్తా కొట్టుకుపోయింది (viral news). ఈ ముగ్గు విషయంలో ఇరు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. పక్కింట్లో ఉంటున్న‌ దుర్గేష్ అనే వ్య‌క్తి మాణిక్‌తో ఈ విష‌య‌మై గొడ‌వ‌ప‌డ్డాడు. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ దాడిలో మాణిక్ కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించే క్రమంలోనే చనిపోయాడు.