Visakhapatnam: పెంపుడు కుక్క క‌ర‌వ‌డంతో తండ్రీ కొడుకులు మృతి

father and son dies after being bitten by pet dog

Visakhapatnam: పెంపుడు కుక్క క‌ర‌వ‌డంతో రేబీస్ సోకి తండ్రీ కొడుకులు మృతిచెందిన ఘ‌ట‌న విశాఖ‌ప‌ట్నంలో చోటుచేసుకుంది. భీమిలికి చెందిన న‌ర్సింగా రావు అనే వ్యక్తి ఓ కుక్క‌ను పెంచుకుంటున్నాడు. దానికి ఆల్రెడీ రేబీస్ ఉంది. అది న‌ర్సింగా రావుతో పాటు అత‌ని కుమారుడు భార్గ‌వ్‌ను కరిచింది. ఆ త‌ర్వాత ఆ కుక్క చ‌నిపోయింది. దాంతో తండ్రీకొడుకులు యాంటీ రేబీస్ ఇంజెక్ష‌న్ వేయించుకున్నారు. అది విక‌టించడంతో ఇద్దరూ మృతిచెందారు. న‌ర్సింగా రావు ఆర్టీసీలో ప‌నిచేసేవాడు. అత‌నికి ఆల్రెడీ ప‌క్ష‌వాతం వ‌చ్చింది. కొడుకు భార్గ‌వ్ రైల్వేస్‌లో ఉద్యోగం చేస్తూ ఇంటిని చూసుకుంటున్నాడు. తండ్రీకొడుకుల మ‌ర‌ణంతో భీమిలిలో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి. పోలీసులు క్షేత్ర‌స్థాయిలో ద‌ర్యాప్తు చేప‌డ‌తామ‌ని తెలిపారు.