Falaknuma Express: భారీ మంట‌లు.. త‌ప్పిన పెను ప్ర‌మాదం

Hyderabad: ఫ‌ల‌క్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో (falaknuma express) భారీ మంట‌లు వ్యాపించాయి. ఎక్స్‌ప్రెస్‌లోని రెండు భోగీలు మంట‌ల్లో ద‌గ్ద‌మ‌య్యాయి. సికింద్రాబాద్‌లోని (secunderabda) ప‌గిడిప‌ల్లి ప్రాంతంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన సిబ్బంది వెంటనే ప్ర‌యాణికుల‌ను దించేయడంతో పెను ప్ర‌మాదం త‌ప్పింది. ఈ ఘ‌ట‌న ఎలా జ‌రిగింది అనే దానిపై రైల్వే అధికారులు విచార‌ణ చేప‌డుతున్నారు.