Prakasam: బస్సు మారినా విధి రాతను మార్చలేకపోయింది

బ‌స్సు మారినా.. విధి రాత‌ను మార్చ‌లేక‌పోయింది. ఓ బ‌స్సుకు ప్ర‌మాదం జ‌రిగింద‌ని మ‌రో బ‌స్సు ఎక్కితే.. అది కూడా ప్ర‌మాదానికి గురై ఓ మ‌హిళ ప్రాణాల‌ను బ‌లిగొంది. ఈ ఘ‌ట‌న ప్ర‌కాశం (prakasam) జిల్లాలో చోటుచేసుకుంది. మానస అనే మహిళ తొలుత ఆర్టీసీ బస్సు ఎక్కగా దానికి ప్రమాదం జరిగింది. వెంటనే మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎక్కి గమ్యస్థానం చేరుకోవాలని అనుకుంది. కానీ ఆ బస్సుకు కూడా ప్రమాదం జరగడంతో ఆమె ప్రాణాలను కోల్పోయింది.