Suryapet: అమ్మ క‌డుపు కాలింది

elderly woman complains on her son to rdo

Suryapet: అమ్మ క‌డుపు కాలింది. బాధ భ‌రించ‌లేక బిడ్డ‌పై ఫిర్యాదు చేసింది. సూర్యాపేట జిల్లా కోదాడలోని గాంధీనగర్ వాసి సోమపంగు వెంకమ్మ స్థానిక మున్సిపాలిటీలో కామాటిగా విధులు నిర్వహించి, పదవీ విరమణ పొందింది. కాగా తనకున్న ఒక్కగానొక్క కొడుకు, కోడలు తనని చూడకుండా తనని ఇబ్బందులకు గురిచేస్తున్నారని కోదాడ RDO ఆఫీసులో విలపించింది. కనీసం తన కడుపుకు పిడికెడు అన్నం కూడా పెట్టడం లేదంటూ కన్నీరు మున్నీరుగా విలపించింది. పింఛన్ కూడా తన వద్ద నుంచి వారు లాక్కుంటున్నారని వాపోయింది.