ఆప‌రేష‌న్ మ‌ధ్య‌లోనే ఆపేసి వెళ్లిపోయిన డాక్ట‌ర్..!

Doctor: ఓ వైద్యుడు స‌ర్జ‌రీ చేస్తూ మ‌ధ్య‌లోనే ఆపేసి వెళ్లిపోయాడు. ఈ ఘ‌ట‌న మ‌హారాష్ట్ర‌లోని నాగ్‌పూర్ ప్ర‌భుత్వ హాస్పిట‌ల్‌లో చోటుచేసుకుంది. ఇంత‌కీ ఆ డాక్ట‌ర్ ఎందుక‌లా చేసాడో తెలిస్తే షాక‌వుతారు. అస‌లు ఏం జ‌రిగిందంటే.. తేజ్‌రంగ్ అనే వైద్యుడు నాగ్‌పూర్‌లోని ఓ ప్ర‌భుత్వ హాస్పిట‌ల్‌లో ఈరోజు 8 స‌ర్జ‌రీలు చేయాల్సి ఉంది. మ‌ధ్యాహ్నం క‌ల్లా నాలుగు స‌ర్జ‌రీలు పూర్తి చేసిన తేజ్‌రంగ్ కాస్త అల‌స‌ట‌గా ఉంద‌ని ఓ క‌ప్పు చాయ్ కావాల‌ని స్టాఫ్‌ని అడిగారు. ఎంత‌సేపైనా చాయ్ ఇవ్వ‌క‌పోవ‌డంతో ఆయ‌న ఆప‌రేష‌న్ చేస్తూ మ‌ధ్య‌లోనే ఆపేసి వెళ్లిపోయారు.

హాస్పిట‌ల్ వ‌ర్గాలు విచార‌ణ చేప‌ట్ట‌గా తేజ్‌రంగ్‌కు మ‌ధుమేహ స‌మస్య ఉంద‌ని.. ఆయ‌నకు ఒక్కసారిగా షుగ‌ర్ లెవెల్స్ ప‌డిపోవ‌డంతో ఇంటికి వెళ్లిపోయార‌ని తెలిసింది. దాంతో వెంట‌నే మ‌రో వైద్యుడ్ని పిలిపించి మిగ‌తా న‌లుగురికి స‌ర్జ‌రీలు నిర్వ‌హించేలా హాస్పిట‌ల్ సిబ్బంది చ‌ర్య‌లు తీసుకున్నారు. చాయ్ కోసం నిర్ల‌క్ష్యంగా స‌ర్జ‌రీని మ‌ధ్య‌లోనే ఆపేసి వెళ్లిపోయిన తేజ్‌రంగ్‌పై పంచాయ‌తీ స‌భ్యుల‌కు ఫిర్యాదు చేసారు. క‌ప్పు చాయ్ కోసం ఇలా స‌ర్జ‌రీ చేస్తూ మ‌ధ్య‌లో వ‌దిలేసి వెళ్లిపోయే వైద్యుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల్సిందేన‌ని డిమాండ్ చేస్తున్నారు.