Ayodhya: పోటెత్తుతున్న భ‌క్తులు.. కంట్రోల్ చేయ‌లేక‌పోతున్న సిబ్బంది

Ayodhya: నిన్న అయోధ్య‌లో శ్రీరామ చంద్ర‌మూర్తి విగ్ర‌హ ప్రాణ ప్ర‌తిష్ఠ కార్య‌క్ర‌మం అట్ట‌హాసంగా జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఎంద‌రో అతిర‌థ మ‌హార‌థులు ఈ వేడుక‌ను క‌నులారా వీక్షించేందుకు హాజ‌ర‌య్యారు. నిన్న అంద‌రికీ ఆల‌యానికి వెళ్ల‌డం కుద‌ర‌క‌పోవ‌డంతో ఈరోజు భ‌క్తులు రామ‌య్య ద‌ర్శ‌నానికి పోటెత్తారు. దాంతో అయోధ్య అంతా భ‌క్తుల‌తో ర‌ద్దీగా మారిపోయింది. వారిని అదుపు చేయ‌డం సిబ్బంది త‌రం కూడా కావ‌డంలేదు.