రోడ్డుపై మృత‌దేహం.. మంచులో క‌నిపించ‌క తొక్కేసిన‌ వాహ‌నాలు

Viral News: ఢిల్లీలో పొగ మంచు ఏ స్థాయిలో ఉందో చెప్ప‌డానికి ఈ దారుణ‌మైన ఘ‌ట‌నే నిదర్శ‌నం. ఆల్రెడీ యాక్సిడెంట్ అయ్యి రోడ్డుపై చ‌చ్చి ప‌డున్న మృత‌దేహంపై వ‌రుస‌గా వాహ‌నాలు ఎక్కేసాయి. ఇందుకు కార‌ణం పొగ మంచు వ‌ల్ల రోడ్డుపై ఉన్న‌వి క‌నిపించ‌కపోవ‌డ‌మే. తీరా గుర్తించేసరికి మృత‌దేహం నుజ్జునుజ్జ‌యిపోయి వేళ్లు తెగిప‌డి ఉన్నాయి. సోమ‌వారం ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు మృత‌దేహం ఎవ‌రిదో పోలీసులు క‌నిపెట్ట‌లేక‌పోయారు. వివ‌రాల కోసం దాదాపు 16 సీసీటీవీ ఫుటేజ్‌లు ప‌రిశీలించారు. అయినా కూడా మృతుని వివ‌రాలు తెలియ‌రాలేదు. ఈ నేప‌థ్యంలో పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌డుతున్నారు.