300 కోట్ల ఆస్తి కోసం.. మామ‌గారిని చంపేందుకు కోడ‌లి సినిమాటిక్ ప్లాన్

daughter in law master plan for 300 crore property

Viral News: రూ.300 కోట్ల ఆస్తి.. ఎలాగైనా ద‌క్కించుకోవాలి. మామ‌గారిని అడ్డు తొల‌గించేస్తే ఆస్తంతా మ‌న‌దే. కానీ నేను చంపితే జైలుకెళ‌తా. నా చేతికి మ‌ట్టి అంట‌కుండా చేయాలి. ఇలా సినిమాల్లో చూపించిన‌ట్లు ఆలోచించి ఓ మ‌హిళ‌.

మ‌హారాష్ట్ర‌లోని నాగ్‌పూర్‌కి చెందిన పురుషోత్తం అనే 82 ఏళ్ల వృద్ధుడు మే 22న జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో మృతిచెందాడు. ఈ కేసును ద‌ర్యాప్తు చేస్తున్న పోలీసులు ముందు హిట్ అండ్ రన్ కేసు అనుకున్నారు. ఆ త‌ర్వాత వాహ‌నంతో ఢీకొట్టిన డ్రైవ‌ర్‌కు బెయిల్ వ‌చ్చింది. సాధార‌ణ కేసుల్లాగే ఈ కేసును కూడా పోలీసులు విచార‌ణ చేప‌డుతుండ‌గా.. ఓ పై స్థాయి ఉన్న పోలీస్ అధికారి ఇది సాధార‌ణ హిట్ అండ్ ర‌న్ కేసు కాద‌ని త‌న టీంతో కాస్త లోతుగా విచార‌ణ చేయించారు.

సుపారీ ఇచ్చి.. యాక్సిడెంట్ చేయించి…

కాస్త లోతుగా విచార‌ణ చేప‌ట్ట‌గా.. కోడ‌లు అర్చ‌న‌ మామ‌గారిని రూ.300 కోట్ల ఆస్తి కోసం సుపారీ ఇచ్చి మ‌రీ యాక్సిడెంట్ చేయించింద‌ని తేలింది. ఇందుకోసం అర్చ‌న హంత‌కుడికి రూ.1 కోటి సుపారీ ఇచ్చింది. హంత‌కుడు కూడా ఎవ‌రో కాదు. అర్చ‌న ఇంట్లో ప‌నిచేస్తున్న ఫ్యామిలీ డ్రైవ‌ర్. ఇంట్లోని కారుతో యాక్సిడెంట్ చేస్తే అనుమానం వస్తుంద‌ని సెకండ్ హ్యాండ్ కారు కొని మ‌రీ ఈ దారుణానికి ఒడిగ‌ట్టారు. ఈ నేప‌థ్యంలో పోలీసులు అర్చ‌న‌తో పాటు మ‌రో ఇద్దరు నిందితుల‌ను అదుపులోకి తీసుకున్నారు.