Rakhi: త‌మ్ముడు కావాలని అడిగిన కూతురు.. ప‌సికందు కిడ్నాప్!

రాఖీ (rakhi) పండుగ వ‌స్తున్న సంద‌ర్భంగా త‌న‌కు ఒక త‌మ్ముడు కావాల‌ని కూతురు అడిగింది. ఇప్ప‌టికిప్పుడు త‌మ్ముడిని ఎక్క‌డి నుంచి తీసుకురావాలా అని ఆలోచించిన ఆ తల్లిదండ్రులు..ఒక మాస్ట‌ర్ ప్లాన్ వేసారు. ఢిల్లీకి చెందిన సంజ‌య్ గుప్తా, అనిత గుప్తా దంప‌తుల‌కు ఒక కుమారుడు పుట్టి.. ప్ర‌మాదంలో చ‌నిపోయాడు. ఆ త‌ర్వాత కూతురు పుట్టింది. అయితే రాఖీ పండుగ వ‌స్తున్న సంద‌ర్భంగా రాఖీ క‌ట్ట‌డానికి త‌న‌కు ఒక అన్న‌య్య కావాల‌ని కూతురు అడిగింది.

కూతురి బాధ‌ను చూడ‌లేక ఓ మ‌గ‌పిల్లాడిని కిడ్నాప్ చేయాల‌నుకున్నారు. ప్లాన్ వేసుకుని గురువారం తెల్ల‌వారుజామున ఓ విక‌లాంగురాలికి పుట్టిన మ‌గబిడ్డ‌ను ఎత్తుకుని పోయారు. దాంతో ఆమె పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. విచార‌ణ‌లో భాగంగా పోలీసులు సీసీటీవీ చెక్ చేయ‌గా.. ఓ బైక్‌పై దంప‌తులు బిడ్డ‌ను తీసుకెళ్తున్న దృశ్యాలు క‌నిపించాయి. ఆ బైక్ నెంబ‌ర్ ఆధారంగా అది సంజ‌య్ అనే వ్య‌క్తి పేరుపై రిజిస్ట‌ర్ అయిన‌ట్లు తెలిసింది. వెంటనే వారిని అదుపులోకి తీసుకుని విచారించ‌గా.. త‌మ కూతురి బాధ‌ను చూడ‌లేక ఈ ప‌ని చేసామ‌ని ఒప్పుకున్నారు. వారిని రిమాండ్‌కు త‌ర‌లించారు. (rakhi)