Renuka Swamy Murder: ద‌ర్శ‌న్ కోసం జైల్లో టీవీ

darshan thoogudeepa gets tv in jail

Renuka Swamy Murder: క‌న్న‌డ న‌టుడు ద‌ర్శ‌న్ ప్ర‌స్తుతం బ‌ళ్లారి జైలులో రిమాండ్‌గా ఉన్నాడు. అభిమాని రేణుకా స్వామిని దారుణంగా హ‌త్య చేసిన కేసులో ద‌ర్శ‌న్‌తో పాటు న‌టి ప‌విత్రా గౌడ‌, మ‌రో 11 మంది నిందితులు బెంగ‌ళూరు సెంట్ర‌ల్ జైలులో ఉన్నారు. అయితే కొన్ని రోజుల క్రితం ద‌ర్శ‌న్ ఉన్న బెంగ‌ళూరు సెంట్ర‌ల్ జైలులో సిగ‌రెట్ తాగుతూ.. త‌న స‌న్నిహితుల‌తో కుర్చీలో కూర్చుని ద‌ర్జాగా గ‌డుపుతున్న ఫోటోలు బ‌య‌టికి రావ‌డంతో ఆయ‌న్ను బళ్లారి జైలుకు త‌ర‌లించారు.

ఈ నేప‌థ్యంలో ఈరోజు ద‌ర్శ‌న్ ఉన్న జైలులో ఓ టీవీ ఏర్పాటుచేసారు. త‌న కేసుకు సంబంధించిన అన్ని విష‌యాలు త‌న‌కు తెలీయాల‌ని ద‌ర్శ‌న్ కోర‌డంతో ఈ ఏర్పాటుచేసారు. ఖైదీల‌కు టీవీలు ఏర్పాటు చేసే అవ‌కాశం ఉంది. కాక‌పోతే కేవ‌లం ఒక వార్తా ఛానెల్ మాత్ర‌మే వ‌చ్చేలా టీవీ ఏర్పాటుచేస్తారు. అంతేకాకుండా.. ద‌ర్శ‌న్‌కు పోయిన నెల‌ రూ.30 వేల వ‌ర‌కు బ్యాంక్ ఖాతాలో అత‌ని భార్య విజ‌య‌ల‌క్ష్మి డ‌బ్బు జ‌మ చేసింది. అందులో నుంచి ద‌ర్శ‌న్ చాయ్, సిగ‌రెట్‌కు రూ.300 వ‌ర‌కు ఖ‌ర్చు పెట్టార‌ట‌. అంతేకాకుండా.. ఇండియ‌న్ టాయ్‌లెట్ వాడ‌లేక‌పోతున్నాన‌ని.. త‌న‌కు స‌ర్జిక‌ల్ చైర్ కావాల‌ని ద‌ర్శ‌న్ కోర‌డంతో ఆ ఏర్పాటును కూడా చేసారు.

ఇటీవ‌ల పోలీసులు కోర్టులో ద‌ర్శ‌న్, ప‌విత్ర గౌడ‌, మిగిలిన 11 మందికి సంబంధించిన 3000 పేజీల ఛార్జ్‌షీట్‌ను ఫైల్ చేసారు. దీనిపై న్యాయ‌స్థానం త్వ‌ర‌లో విచార‌ణ జ‌రిపే అవ‌కాశం ఉంది.