Tamilnadu: రెండు లారీల మధ్య నలిగి దంపతులు దుర్మరణం

Tamilnadu: తమిళనాడులో ఘోరం చోటుచేసుకుంది. సేలంకు చెందిన అలగరసన్(30), ఇలమతి(25) అనే దంప‌తులు వారి ఇద్దరు పిల్లలతో కలిసి బైక్‌పై వెళ్తూ లారీ వెనుక ఆగారు. ఇంతలో వెనక నుండి వచ్చిన‌ ఇంకో లారీ వారిని నలిపేస్తూ ముందున్న లారీని ఢీకొంది. ఈ ఘ‌ట‌న‌లో దంప‌తులు అక్క‌డిక‌క్క‌డే మృతిచెంద‌గా.. పిల్ల‌లు స్వ‌ల్ప గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డారు. పిల్ల‌లు అల‌గ‌ర‌స‌న్, ఇల‌మ‌తి మ‌ధ్య‌లో కూర్చుని ఉండ‌టంతో వారికి ఏమీ కాలేదు. త‌ల్లిదండ్రుల కోసం ఆ ఇద్ద‌రూ బోరున ఏడుస్తుండ‌డంతో అక్క‌డివారి మ‌న‌సులు క‌ల‌చివేసాయి.