భార్య అనుమానాస్ప‌ద మృతి.. కొల‌నులో భ‌ర్త శ‌వం

couple deaths in karnataka creates sensation

Karnataka: క‌న్న‌డ నాట ఘోర ఘ‌ట‌న చోటుచేసుకుంది. మండ్య జిల్లాలో ఓ జంట అనుమానాస్ప‌ద మృతి స్థానికంగా సంచ‌ల‌నం సృష్టించింది. భార్య ఆత్మ‌హ‌త్య చేసుకోగా.. భ‌ర్త మృత‌దేహం ఓ కొల‌న‌లో ల‌భించింది. మండ్య‌కు చెందిన మోహ‌న్ (25) స్వాతి (23)ల‌కు రెండేళ్ల క్రితం పెళ్లి జ‌రిగింది. వీరికి ఏడాది కూతురు ఉంది. అయితే కొంత‌కాలంగా భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య వివాదాలు జ‌రుగుతున్నాయి. మోహ‌న్ త‌ల్లిదండ్రులు క‌ట్న తేవాలంటూ వేధింపుల‌కు గురిచేస్తున్నార‌ని స్వాతి కొన్ని నెల‌ల క్రితం పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. ఈ కోపంతోనే మోహ‌న్ ముందు స్వాతిని హ‌త్య చేసి ఆ త‌ర్వాత తాను కొల‌నులో దూకి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డి ఉంటాడ‌ని స్వాతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. త‌ల్లిదండ్రుల‌ను కోల్పోయిన చిన్నారి వారి కోసం క‌న్నీరుమున్నీరుగా విల‌పిస్తోంది.