Kerala Landslides: 15 కోట్లు విరాళంగా ఇచ్చిన ఖైదీ సుఖేష్ చంద్ర‌శేఖ‌ర్

conman sukesh chandrashekhar donates 15 crores to kerala

Kerala landslides: వ్యాపార‌వేత్త‌లు, రాజ‌కీయ నాయ‌కుల నుంచి రూ.200 కోట్ల వ‌ర‌కు దోపిడీ చేసిన సుఖేష్ చంద్ర‌శేఖ‌ర్.. కేర‌ళ‌కు భూరి విరాళం ఇచ్చి పెద్ద మ‌న‌సు చాటుకున్నాడు. ఇప్ప‌టివ‌ర‌కు ఎవ్వ‌రూ ఇవ్వ‌నంత మొత్తాన్ని విరాళంగా ప్ర‌క‌టించాడు. కేర‌ళ‌లోని వాయ‌నాడ్‌లో కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డటంతో దాదాపు 200 మంది మృత్యువాత‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. వారి కోసం రూ.15 కోట్ల విరాళంతో పాటు 300 వ‌ర‌కు ఇళ్లు క‌ట్టిస్తాన‌ని సుఖేష్ ప్ర‌క‌టించ‌డం వైర‌ల్‌గా మారింది. ప్ర‌స్తుతం ఢిల్లీలోని మండోలి జైలులో శిక్ష అనుభ‌విస్తున్న సుఖేష్ కేర‌ళ దారుణాన్ని పేప‌ర్‌లో చ‌దివి తెలుసుకున్నాన‌ని ఆ దృశ్యాలు త‌న‌కెంతో బాధ క‌లిగించాయ‌ని తెలిపాడు. ఈ విష‌యాల‌న్నీ త‌న లాయ‌ర్ ద్వారా సుఖేష్ మీడియాకు తెలియ‌జేసాడు.