Train Accident: గాయ‌ప‌డిన‌వారిని తీసుకెళ్తున్న బ‌స్సుకి యాక్సిడెంట్!

Odisha: ఒడిశా రైలు ప్ర‌మాదంలో (train accident) గాయ‌ప‌డిన‌వారిని బస్సులో తీసుకెళ్తుండ‌గా.. ఆ బ‌స్సు ప్ర‌మాదానికి గుర‌వ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. గాయ‌ప‌డిన‌వారికి మెరుగైన సాయం అందించేందుకు కొంద‌రిని వెస్ట్ బెంగాల్‌లోని హాస్పిట‌ల్‌కి ఓ బస్సులో ఎక్కించారు. ఆ బ‌స్సు వెస్ట్ బెంగాల్‌కు చేరుకోగానే మిడినిపూర్ ప్రాంతంలో పిక‌ప్ వ్యాన్‌ను ఢీకొంది. ఆల్రెడీ గాయాల‌తో ఉన్న‌వారికి మ‌ళ్లీ స్వ‌ల్ప గాయాల‌య్యాయి. దాంతో పోలీసులు హుటాహుటిన ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని ద‌గ్గ‌ర్లోని వివిధ హాస్పిట‌ల్స్‌కు తర‌లించారు.