Rajanna Sircilla: ప్రేమించిన వారితో పెళ్లికి ఒప్పుకోలేదని అన్నా, చెల్లెలు ఆత్మహత్య

brother and sister commit suicide as parents oppose their love marriage

Rajanna Sircilla: రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలో ఘోరం చోటుచేసుకుంది. తాము ప్రేమించిన వ్య‌క్తుల‌తో పెళ్లికి ఒప్పుకోవ‌డం లేద‌ని మూడు నెల‌ల వ్య‌వ‌ధిలోనే అన్నాచెల్లెళ్లు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. వేముల‌వాడ రూర‌ల్ మండ‌లం నూక‌ల‌మ‌ర్రికి చెందిన పాలకుర్తి లింగయ్య, పద్మ దంపతులకు కొడుకు ప్రశాంత్(22), కూతురు నవ్య ఉన్నారు. వీరిద్ద‌రూ మరో కుటుంబానికి చెందిన అన్నా, చెల్లెళ్లను ప్రేమించారు.

నవ్యకు ఆరు నెలల కింద ఓ యువకుడితో పెళ్లి అయ్యింది. అతడు పెళ్లి అనంతరం గల్ఫ్ దేశానికి వెళ్లిపోయాడు. అప్పుడు నవ్య అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో ఐదేళ్ల‌ నుంచి ప్రేమలో ఉన్న విషయం తల్లితండ్రులకు చెప్పి.. సదరు యువకుడితో పెళ్లి చేయాలని కోరింది. వారు ఒప్పుకోకపోవడంతో పురుగుల మందు తాగి మూడు నెలల క్రితం ఆత్మహత్య చేసుకుంది.

కాగా నవ్య ప్రేమించిన యువకుడి చెల్లెలిని ఆమె సోదరుడైన ప్రశాంత్ ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. దీని గురించి పెద్దలకు చెప్తే ఒప్పుకోలేదు. దీంతో ప్రశాంత్ కూడా పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ నిన్న మృతిచెందాడు.