స్కూల్ స‌క్సెస్ అవ్వాల‌ని విద్యార్థిని బ‌లిచ్చిన అధికారులు

boy sacrificed for the success of the school

Uttar Pradesh: త‌మ స్కూల్ ఇత‌ర పాఠ‌శాల‌ల క‌న్నా బాగా స‌క్సెస్ అవ్వాల‌న్న ఉద్దేశంతో ఏకంగా ఓ విద్యార్థిని బ‌లిచ్చేసారు. ఈ దారుణ ఘ‌ట‌న ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. స్థానిక రాస్గావ‌న్ ప్రాంతంలో ఉన్న డీఎల్ ప‌బ్లిక్ స్కూల్ ఉంది. ఈ స్కూల్‌లో రెండో త‌ర‌గ‌తి చ‌దువుతున్న కృత‌ర్థ్ అనే బాలుడిని నిన్న స్కూల్ డైరెక్ట‌ర్ దినేష్ భ‌గేల్‌తో పాటు మ‌రో ముగ్గురు టీచ‌ర్లు బ‌లిదానం చేయాలని అనుకున్నారు. దినేష్ ఈ బ‌లిదానాలు, క్షుద్ర‌పూజ‌ల‌ను బాగా న‌మ్ముతాడు.

ఈ విష‌యాన్ని అదే స్కూల్‌లో ప‌నిచేస్తున్న టీచ‌ర్ల‌కు చెప్పి.. బాలుడిని బ‌లిస్తే స్కూల్‌కి మంచి పేరొస్తుంద‌ని.. అప్పుడు సాల‌రీలు పెరుగుతాయ‌ని ఆశ‌పెట్టాడు. వారు కూడా అత‌ని మాట‌లు న‌మ్మి కృత‌ర్థ్‌ను బ‌య‌టికి తీసుకెళ్లేందుకు ప్ర‌య‌త్నించారు. కృత‌ర్థ్ ఏడ‌వ‌టంతో అత‌ని గొంతు నొక్కి చంపేసాడు. ఆ త‌ర్వాత దినేష్ త‌న కారులో కృత‌ర్థ్‌ను స్థానిక హాస్పిట‌ల్‌కు తీసుకెళ్లి అనారోగ్యంతో చ‌నిపోయాడు అని క‌ట్టుక‌థ చెప్పే ప్రయ‌త్నం చేయాల‌ని చూసాడు.

తమ ప్లాన్ ప్ర‌కార‌మే బాలుడి తండ్రికి ఫోన్ చేసి మీ అబ్బాయి అనారోగ్యంతో స్పృహత‌ప్పి ప‌డిపోతే హాస్పిట‌ల్‌కు తీసుకెళ్తున్నాం త్వ‌ర‌గా రండి అని చెప్పారు. తీరా చూస్తే ఆ బాలుడు హాస్పిట‌ల్‌లో కాకుండా దినేష్ కారు సీటులో ల‌భించాడు. వెంట‌నే బాలుడి తండ్రి పోలీసుల‌కు ఫిర్యాదు చేసారు. గ‌తంలో కూడా ఇలాగే ఓ బాలుడిని బ‌లివ్వాల‌ని ప్ర‌య‌త్నించారు. కానీ ఆ ప్లాన్ ఫెయిల్ అవ‌డంతో కృత‌ర్థ్‌ను చంపేసారు.