Sircilla: గుండెపోటుతో 14 ఏళ్ల విద్యార్థి మృతి

Sircilla: సిరిసిల్లలో విషాదం చోటుచేసుకుంది. కందికట్కూర్ గ్రామనికి చెందిన ఎనిమిదో తరగతి చదువుతున్న సాయితేజ(14) అనే విద్యార్థికి పుట్టుకతోనే గుండెలో రంధ్రం ఉంది. ఆపరేషన్ తప్పనిసరిగా చేయించాలని డాక్టర్లు చెప్పినా ఆర్థిక స్తోమత సరిగా లేకపోవడంతో తల్లిదండ్రులు వైద్యం చేయించలేకపోయారు. నిన్న పాఠశాలకు వెళ్లిన సాయితేజ పాఠశాల ఆవరణలోనే గుండెపోటుతో కుప్పకూలి ప్రాణాలు వదిలాడు.