Boat Accident: పెళ్లికి వ‌చ్చిన 103 మంది దుర్మ‌ర‌ణం

Nigeria: ప‌డ‌వ ప్ర‌మాదంలో (boat accident) పెళ్లికి వ‌చ్చిన అతిథుల్లో 103 మంది నీళ్ల‌లో మునిగిపోయి దుర్మ‌ర‌ణం చెందారు. ఈ దారుణ ఘ‌ట‌న నైజీరియాలో (nigeria) చోటుచేసుకుంది. క‌వారా రాష్ట్రంలోని ప‌టేగి జిల్లాలో ఉన్న నైగ‌ర్ న‌దిలో పెళ్లికి వ‌చ్చిన అతిథుల‌తో ఉన్న ప‌డ‌వ బోల్తా ప‌డింది. లోడ్ ఎక్కువ అవ‌డంతోనే ప‌డ‌వ మునిగిపోయింద‌ని పోలీసులు తెలిపారు. 100 మంది కాపాడామ‌ని ఇంకా గాలింపు చ‌ర్య‌లు జ‌రుగుతున్నాయ‌ని అన్నారు. మృతుల్లో చిన్న‌పిల్ల‌లు చాలా మంది ఉన్నార‌ని తెలిపారు. పెళ్లికి వెళ్లిన‌వారిలో చాలా మంది బైకులపై వెళ్లారు కానీ వ‌చ్చేట‌ప్పుడు వ‌ర్షం ప‌డి రోడ్డు మొత్తం వ‌ర‌ద నీరు ఉండ‌డంతో బోటు ఎక్కార‌ని, ఆ బోటు సామ‌ర్ధ్యం 150 మంది అయిన‌ప్ప‌టికీ 300 మంది ఎక్కార‌ని స్థానిక అధికారులు తెలిపారు.