Robbery: ఇదెక్క‌డి మాస్ దొంగ‌త‌నం రా మావా..!

Madhya Pradesh: ఒక ఇంట్లో దొంగ‌లు ప‌డ్డార‌నుకోండి.. సైలెంట్‌గా దొరికింది దోచుకునిపోతారు (robbery). లేదా వారు పట్టుకుని పోల‌సుల‌కు అప్ప‌జెప్తారేమోన‌ని ప్రాణాలు తీసేసేవారూ ఉంటారు. ఏమీ దొర‌క్క చివ‌రికి ఓ ప‌ది రూపాయ‌లు పెట్టి వెళ్లిపోయే మంచి దొంగ‌లూ ఉన్నారు. కానీ ఈ దొంగ‌లు అంత‌కుమించిన టాలెంట్‌తో ఉన్నారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని (madhya pradesh) ఉడుపిలో జ‌రిగిన ఓ దొంగ‌త‌నం గురించి విని అక్క‌డివారు న‌వ్వుకుంటున్నారు.

ఉజ్జయిని ప్రాంతంలో నిన్న రాత్రి ఓ ఇంట్లో దొంగ‌లుప‌డ్డారు. ఆ ఇంట్లో మొత్తం 10 మంది నివ‌సిస్తున్నారు. వారిలో ఒక్కరికి కూడా మెలుకువ రాలేదు. అంద‌రూ గాఢ నిద్ర‌లో ఉన్నారు. దాంతో దొంగ‌లు క‌బోర్డు తీయడానికి ప్ర‌య‌త్నించారు. కానీ వారికి చేత‌కాలేదు. సౌండ్ చేస్తే లేస్తారేమోన‌ని ఏకంగా క‌బోర్డునే ఎత్తుకుపోయారు. కొద్ది దూరంలో ఉన్న పొలాల్లోకి తీసుకెళ్లి క‌బోర్డు మొత్తం విరగ్గొట్టేసారు. వారి క‌ష్టం ఫ‌లించింది. క‌బోర్డులో రూ.50 ల‌క్ష‌ల వ‌ర‌కు డ‌బ్బు, న‌గ‌లు ఉన్నాయి. వాటిని తీసుకుని ఉడాయించారు. ఉద‌యం లేచి చూసేస‌రికి ఏకంగా క‌బోర్డే క‌నిపించ‌కుండాపోవ‌డంతో అంతా షాక‌య్యారు. వెంట‌నే పోలీసుల‌కు ఫిర్యాదు చేసారు. పొలంలో త‌మ వ‌స్తువులు దొరికిన‌ట్లు తెలీడంతో అంతా అక్క‌డికి చేరుకుని ల‌బోదిబోమ‌న్నారు. (robbery)