Bihar: ఉద్యోగాల పేరిట మోసం.. 200 మందిపై అత్యాచారం..!

bihar Gang accused of raping nearly 200 girls on the pretext of giving them jobs

Bihar:  బిహార్‌లో ఉద్యోగాల పేరిట‌ ఆడ‌వాళ్ల‌ను మోసం చేస్తూ వారిపై అత్యాచారాల‌కు పాల్ప‌డుతున్న ముఠా గుట్టు ర‌ట్టైంది. బిహార్‌లోని ముజ‌ఫ‌ర్‌పూర్‌లో ఈ దారుణం చోటుచేసుకుంది. బిహార్‌కు చెందిన ఓ ముఠా DVR పేరిట ఓ కంపెనీ పెట్టి ఉద్యోగాలు లేక ఇబ్బంది ప‌డుతున్న ఆడ‌వాళ్ల‌ను టార్గెట్ చేసింది. ఉద్యోగాలు ఇప్పిస్తామ‌ని చెప్పి దాదాపు 200 మంది ఆడ‌పిల్ల‌ల‌ను బంధించి చిత్ర‌హింస‌లు పెట్టారు. బెల్టుల‌తో కొట్టి వారిపై అత్యాచారాల‌కు పాల్ప‌డ్డారు.

సోష‌ల్ మీడియాను ఆధారంగా చేసుకుని మంచి జీతానికి ఉద్యోగాలు ఉన్నాయ‌ని పోస్ట్‌లు పెట్టేవారు. ఉద్యోగం కోసం వెతుకున్న ఆడ‌వాళ్లు ఆ పోస్ట్ ద్వారా ముఠాను క‌ల‌వ‌డం.. వారు మాయ‌మాట‌లు చెప్పి ఓ ప్ర‌దేశానికి తీసుకెళ్లి బంధించ‌డం వంటివి చేస్తున్నారు. చాప్రా అనే ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయి వారి నుంచి త‌ప్పించుకుని నేరుగా పోలీసుల వ‌ద్ద‌కు వెళ్ల‌డంతో ఈ ముఠా గుట్టు బ‌య‌ట‌ప‌డింది. అలా దాదాపు 200 మంది అమ్మాయిల‌ను పోలీసులు ర‌క్షించారు.