Father: కూతురి చితిలో దూక‌బోయిన తండ్రి..!

Bhilwara: ఏ తండ్రికీ ఇలాంటి క‌ష్టం రాకూడ‌దు. క‌న్న‌బిడ్డ కామాంధుల చేతిలో బ‌లైపోవ‌డంతో ఏమీ చేయ‌లేక ఆ క‌న్నతండ్రి (father) ఆవేద‌న వ‌ర్ణించ‌లేనిది. పోలీస్ స్టేష‌న్లు, కోర్టుల చుట్టూ తిరిగే కంటే త‌న బిడ్డ‌తోనే ఈ లోకాన్ని వీడిపోవాల‌నుకున్నాడు. ఈ హృద‌య‌విదార‌క ఘ‌ట‌న రాజ‌స్థాన్‌లో (rajasthan) చోటుచేసుకుంది. భిల్వారాకు (bhilwara)  చెందిన 14 ఏళ్ల బాలిక‌పై కొంద‌రు వ్య‌క్తులు దారుణంగా రేప్ చేసి మంట‌ల్లో ప‌డేసి పారిపోయారు. ఆగ‌స్ట్ 2న త‌న కూతురు క‌నిపించ‌కుండాపోయింద‌ని ఆ తండ్రి (father) పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసారు. పోలీసులు విచార‌ణ చేప‌ట్ట‌గా ఆగ‌స్ట్ 4న భిల్వారాలోని ఓ కొలను స‌మీపంలో బాలిక చెంది స‌గం కాలిపోయిన అవ‌యవాలు కనిపించాయి. ఫోరెన్సిక్ రిపోర్టులో అవి త‌న బిడ్డ అవ‌య‌వాలే అని త‌లిసి ఆ తండ్రి గుండె ప‌గిలిపోయింది. ఐదుగురు వ్య‌క్తులు బాలిక‌పై మృగాల్లా గ్యాంగ్ రేప్ చేసి మ‌రీ మంట‌ల్లో విసిరేసార‌ని పోస్ట్ మార్టం రిపోర్ట్‌లో తేలింది.

ఈ కేసులో భాగంగా పోలీసులు ఇప్ప‌టివ‌ర‌కు ఐదుగురు నిందితుల‌ను అదుపులోకి తీసుకున్నారు. బాలిక స‌గం కాలిన మృత‌దేహానికి ద‌హ‌న సంస్కారాలు నిర్వ‌హిస్తుండ‌గా.. బాలిక తండ్రి అదే చితిలోకి దూకి చ‌నిపోవాల‌నుకున్నాడు. స్థానికులు వెంట‌నే ఆయ‌న్ను కాపాడి ద‌గ్గ‌ర్లోని హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. ఆయ‌న ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌ని వైద్యులు తెలిపారు. ఈ కేసును అంత తేలిగ్గా వ‌దిలేది లేద‌ని, బాలిక‌కు త‌ప్ప‌కుండా న్యాయం జ‌రిగేలా చూస్తామ‌ని పోలీసులు తెలిపారు.