Bengaluru: త‌ల్లిని చంపిన మ‌హిళ‌.. శ‌వంతో పోలీస్ స్టేష‌న్‌కు..!

Bengaluru: క‌న్న‌త‌ల్లిని దారుణంగా చంపి శ‌వాన్ని సూట్‌కేస్‌లో పెట్టుకుని నేరుగా పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లి లొంగిపోయింది ఓ మ‌హిళ‌. ఈ దారుణ ఘ‌ట‌న బెంగ‌ళూరులో (bengaluru) చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. వెస్ట్ బెంగాల్‌కు చెందిన సోనాలి సేన్ అనే మ‌హిళ త‌న భ‌ర్త‌, త‌ల్లితో క‌లిసి బెంగ‌ళూరులోని (bengaluru) మికో లేఅవుట్ ఏరియాలో ఉంటోంది. నిన్న రాత్రి త‌న త‌ల్లితో గొడ‌వ జ‌ర‌గ‌డంతో కోపంలో ఆమెను పొడిచేసింది. దాంతో ఆమె అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోయింది. ఏం చేయాలో తెలీక ఆ శ‌వాన్ని సూట్‌కేసులో పెట్టుకుని స్థానిక పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లింది. సూట్‌కేసులో శవాన్ని చూసి పోలీసులు షాక‌య్యారు. వెంట‌నే ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కొంత‌కాలంగా త‌న త‌ల్లితో గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయ‌ని, హ‌త్య జ‌రిగిన‌ప్పుడు త‌న భ‌ర్త ఇంట్లో లేడ‌ని సోనాలి తెలిపింది.