Tirumala: అలిపిరిలో దొరికిన బాలిక మృత‌దేహం

Tirumala: తిరుమల అలిపిరి కాలి నడక దారిలో ఘోరం జ‌రిగింది (tirumala). ల‌క్షిత అనే చిన్నారి మృత‌దేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టం నివేదిక ప్ర‌కారం.. ల‌క్షిత‌పై ఎలుగుబంటి దాడి చేసి చంపిన‌ట్లు తేలింద‌ని పోలీసులు తెలిపారు. ల‌క్షిత త‌ల్లి తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. నిన్న రాత్రి ల‌క్షిత త‌ప్పిపోయింది. ఉద‌యం చూసేస‌రికి అలిపిరి న‌డ‌క దారిలో ఉన్న నరసింహస్వామి ఆలయం వద్ద చిన్నారి శ‌వ‌మై క‌నిపించింది. చిన్నారి మృత‌దేహాన్ని బ‌ట్టి చూస్తే ఎలుగుబంటి మెడపై దాడి చేసి ముఖ భాగాన్ని పూర్తిగా తినేసినట్లు క‌నిపిస్తోంద‌ని పోలీసులు తెలిపారు. పాప ఒంట‌రిగా వెళ్తున్న సమయంలో పాపను ఎలుగుబంటి ఎత్తుకెళ్లినట్టుగా తిరుమ‌ల ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ అధికారులు అనుమానిస్తున్నారు. మెట్ల మార్గంలో కాకుండా పక్కకు వెళ్ల‌డం వ‌ల్ల ఈ దారుణం చోటుచేసుకుంద‌ని తెలిపారు. బిడ్డ చ‌నిపోవ‌డంతో ల‌క్షిత త‌ల్లి క‌న్నీరుమున్నీర‌వుతున్నారు. (tirumala)