Train Accident: సంతోషంగా ఉందంటూ బాంగ్లాదేశ్ వాసి ట్వీట్

Odisha: ఒడిశా రైలు ప్ర‌మాద ఘ‌ట‌న (train accident) ప‌ట్ల భార‌త‌దేశం అంతా క‌న్నీరుమున్నీరు అవుతుంటే.. బంగ్లాదేశ్‌కి (bangladesh) చెందిన ఓ నీచుడు మాత్రం సంతోషంగా ఉందంటూ ట్వీట్ చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. బంగ్లాదేశ్‌కి చెందిన బాబ‌ర్ జ‌మాన్ అనే హ్యూమ‌న్ రైట్స్ డిఫెండ‌ర్ ఒడిశా రైలు ప్ర‌మాద ఘ‌ట‌న గురించి ట్వీట్ చేసాడు. అస‌లు ఎంత మంది చ‌నిపోయారో స‌రైన నెంబ‌ర్ ఎందుకు చెప్ప‌డంలేదు? ఇంకా మోదీ సీఎంకు కాల్ చేయ‌లేదా? ఏదైతేనేం.. ఈ ప్ర‌మాదంలో హిందువులు చ‌నిపోయినందుకు చాలా సంతోషంగా ఉంది అని ట్వీట్ చేసాడు. దాంతో ట్విట‌ర్‌లో ర‌చ్చ మొద‌లైంది. ఇలాంటి రాక్ష‌సుడ్ని చంపినా పాపం లేదంటూ నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.