Babar Azam: మ్యాచ్ కంటే టికెట్ల ఒత్తిడే ఎక్కువ‌గా ఉంది

కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ (india pakistan match) అహ్మ‌దాబాద్‌లోని న‌రేంద్ర మోదీ స్టేడియం (narendra modi stadium) వేదిక‌గా శ‌నివారం జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో పాకిస్థాన్ స్కిప్ప‌ర్ బాబ‌ర్ ఆజాం (babar azam) ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసారు. రేపు జ‌ర‌గ‌బోయే మ్యాచ్ కంటే టికెట్లు దొరుకుతాయో లేదో అనే టెన్ష‌నే ఎక్కువ‌గా ఉంద‌ని అన్నారు. హైద‌రాబాద్‌లో ఇటీవ‌ల మ్యాచ్ ఆడిన‌ప్పుడు టికెట్లు బాగానే దొరికాయ‌ని ఇప్పుడు అహ్మ‌దాబాద్‌లో రేపు జ‌ర‌గ‌బోయే మ్యాచ్‌కి కూడా టికెట్స్ దొరికితే బాగుంటుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. రేపు జ‌ర‌గ‌బోయే మ్యాచ్ గురించి భ‌యం లేద‌ని.. ఎందుకంటే గ‌తంలో ఇండియాతో ఎన్నో మ్యాచ్‌లు ఆడిన అనుభ‌వం ఉంద‌ని అన్నారు. ఇప్పుడు గ‌తంలో జ‌రిగిన మ్యాచ్‌ల గురించి ఆలోచించ‌డం వేస్ట్ అని ప్ర‌స్తుతం ఎలా ఉన్నాం అనేదే ముఖ్యం అని తెలిపారు. (babar azam)