అయోధ్య రామ‌మందిర క్లీన‌ర్‌పై గ్యాంగ్ రేప్‌.. నిందితుడు BJP నేత కుమారుడు

ayodhya temple cleaner gang raped

Ayodhya: అయోధ్య రామమందిరంలో క్లీన‌ర్‌గా ప‌నిచేస్తున్న ఓ ద‌ళిత యువ‌తిపై 9 మంది గ్యాంగ్‌రేప్‌కు పాల్ప‌డ్డారు. బాధితురాలు ఆల‌యంలో ప‌నిచేస్తుండ‌గా ఓ యువ‌కుడు ప‌రిచయం అయ్యాడు. అత‌ను మ‌రో 8 మందిని తీసుకొచ్చి ఆ అమ్మాయికి ప‌రిచ‌యం చేసాడు. ఇదే అద‌నుగా చూసి పలుమార్లు వివిధ ప్ర‌దేశాల‌కు తీసుకెళ్లి గ్యాంగ్‌రేప్‌కు పాల్ప‌డ్డారు. న‌గ్న వీడియోలు తీసి బ‌య‌టికి చెప్తే లీక్ చేస్తామ‌ని బెదిరించారు.

అయినా ఆ అమ్మాయి భ‌య‌ప‌డ‌కుండా పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌గా వారు ప‌ట్టించుకోలేదు. ఇందుకు కార‌ణం నిందితుల్లో ఒక యువ‌కుడు భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన ఓ నేత కుమారుడు. దాంతో పోలీసులు ఈ కేసుకు దూరంగా ఉన్నారు. పైగా కేసు పెడితే చంపేస్తామ‌ని బాధితురాలి కుటుంబాన్ని బెదిరించారు. అయినా ఆ అమ్మాయి వినిపించుకోకుండా పెద్ద‌ల‌కు స‌మాచారం ఇవ్వ‌డంతో వారు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. మ‌రో న‌లుగురి కోసం గాలిస్తున్నారు.