అప‌చారం.. ప్రాణ ప్ర‌తిష్ఠ‌కు ముందే రామ‌య్య క‌ళ్లు చూపించేసారంటూ ప్ర‌ధాన అర్చకుల ఆగ్ర‌హం

Ayodhya: ఈనెల 22న అయోధ్య రామ మంద‌రంలో రాముల వారి ప్రాణ ప్ర‌తిష్ఠ కార్య‌క్ర‌మం అట్ట‌హాసంగా జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో బాల రాముడి విగ్ర‌హ తొలి ఫోటోలు బ‌య‌టికి వ‌చ్చాయి. అయితే ప్రాణ ప్ర‌తిష్ఠ‌కు ముందు రాముడి క‌ళ్లు చూపించ‌కూడ‌దు. అలాంటిది క‌ళ్లు క‌నిపిస్తున్న ఫోటోల‌ను ప‌బ్లిక్‌కి ఎందుకు విడుద‌ల చేసారంటూ అయోధ్య ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు అరుణ్ యోగిరాజ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

ఇది అప‌చారం కాక‌పోతే ఇంకేంట‌ని మండిప‌డుతున్నారు. అయితే బాల రాముడి ఫోటో మాత్ర‌మే బ‌య‌టికి వ‌చ్చింది.. అస‌లైన రాముడి విగ్ర‌హ ఫోటో మాత్రం బ‌య‌టికి రాలేద‌ని మ‌రో పూజారి అయిన ఆచార్య స‌త్యేంద్ర దాస్ తెలిపారు. ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్యనాథ్ రామ‌య్య విగ్ర‌హాన్ని స్వ‌యంగా తీసుకొస్తార‌ని తెలిపారు.