Venu Swamy: ఇక నేను జోస్యం చెప్ప‌ను

astrologer venu swamy says he will never do predictions about politics

Venu Swamy: వివాదాస్ప‌ద జ్యోతిష్య నిపుణుడు వేణు స్వామి షాకింగ్ నిర్ణ‌యం తీసుకున్నారు. ఇక నుంచి రాజ‌కీయ నేత‌ల మీద కానీ సినీ ప్ర‌ముఖుల మీద కానీ వారి వ్య‌క్తిగ‌త విష‌యాలకు సంబంధించిన జోస్యం మాత్రం చెప్ప‌న‌ని ప్ర‌క‌టించారు. లోక్ స‌భ ఎన్నిక‌ల ఫ‌లితాలు ఈరోజు వెలువ‌డ‌తాయ‌న‌గా.. గ‌త వారం రోజుల నుంచి వేణు స్వామి ఎన్నో మీడియా ఛానెళ్ల‌కు ఇంట‌ర్వ్యూలు ఇచ్చారు. కేంద్రంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఓడిపోతార‌ని.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌గ‌న్ మోహన్ రెడ్డి అఖండ విజ‌యాన్ని సాధిస్తార‌ని ఆయ‌న చెప్పారు. ఆయ‌న చెప్పిన జోస్యం త‌ప్ప‌ని తేల‌డంతో ఓ వీడియో రిలీజ్ చేసారు. ఇక నుంచి తాను ఎవ్వ‌రి గురించీ జోస్యం చెప్ప‌న‌ని అన్నారు.